నేను బెదిరించలేదు..తప్పుడు కేసు పెట్టారు : కొల్లు రవీంద్ర

by  |
kollu ravindra
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి పేర్ని నానిపై మాజీ మంత్రి, టీడీపి పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పేర్ని నాని తనపై వాడిన బాష పద్ధతిగా లేదన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి హోదాలో ఉన్న పేర్ని నాని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. చిలకలపూడిలో వ్యక్తి గుండెపోటుతో చనిపోతే చూడటానికి వెళ్లిన తనపై కేసు పెట్టారని తెలిపారు. పొట్లపాలెంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి భార్యను వంటింట్లోకి వెళ్లి బెదిరించానని వైసీపీ నాయకులు అంటున్నారని తనకు ఏమాత్రం సంబంధం లేదని కొల్లు రవీంద్ర వివరణ ఇచ్చారు. పై నుంచి ఒత్తిడి ఉందని అందువల్లే కేసులు పెడుతున్నామని పోలీసులే తనతో చెప్పారని వెల్లడించారు. మంత్రి పేర్ని నాని చెప్పకుండా పోలీసులు తనపై కేసు పెడతారా అని కొల్లు రవీంద్ర నిలదీశారు.

Next Story

Most Viewed