భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం

by  |
Foreign currency
X

దిశ, రాజేంద్రనగర్: గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఫారెన్ కరెన్సీ తరలిస్తూ ఓ వ్యక్తి సీఐఎస్ఎఫ్ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు అధికారుల వివరాల ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో మహమ్మద్ అనే వ్యక్తి దుబాయ్ వెళ్తున్నాడు. అతనిపై అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్, ఇంటిలిజెన్స్ అధికారులు లగేజీ తనిఖీ చేయగా.. బ్యాగులో రూ. కోటి 30 లక్షల విదేశీ కరెన్సీని గుర్తించి, స్వాదీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని విచారణ నిమిత్తం కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.


Next Story

Most Viewed