వైద్యసిబ్బంది కాదు.. వంట వారు

by  |
వైద్యసిబ్బంది కాదు.. వంట వారు
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా లో పీపీఈ కిట్లు ధరించిన నలుగురు వ్యక్తులు పెళ్లి మండపంలో ప్రవేశిచడంతో పెళ్లిలో పాల్గొన్నవారు ఆందోళన చెందిన ఘటన ముదినేపల్లి కొత్తూరులో చోటు చేసుకుంది. వేణుగోపాల కృష్ణయ్య కల్యాణ మండపంలో వివాహం జరిగింది. వివాహ విందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఇంతలో పీపీఈ కిట్లు ధరించిన నలుగురు వ్యక్తులు వచ్చారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే వారంతా వడ్డించడానికి గుడివాడ నుంచి వచ్చిన క్యాటరింగ్‌ బృందం అని తెలిసి అంతా అవాక్కయ్యారు. వీరంతా, పీపీఈ కిట్లు, ఫేస్‌ షీల్డ్‌ ధరించి పెళ్లికి వచ్చిన బంధు, మిత్రులకు భోజనం వడ్డించారు.

Next Story

Most Viewed