కేబీసీ 12 మొదటి కరోడ్‌పతి.. నాజియా నాసిమ్

by  |
కేబీసీ 12 మొదటి కరోడ్‌పతి.. నాజియా నాసిమ్
X

దిశ, వెబ్‌డెస్క్: కౌన్ బనేగా కరోడ్‌పతి 12వ సీజన్‌లో మొదటి కరోడ్‌పతిగా జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన నాజియా నాసిమ్ నిలిచారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉండి, పని చేస్తున్న నాజియా.. అమితాబ్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి, కరోడ్‌పతిగా నిలవనుంది. ఆమె రూ. 7 కోట్లు గెలిచిందా? లేదా? అని బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో తేలనుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో చదువుకున్న నాజియా ప్రస్తుతం ఒక ప్రఖ్యాత మోటార్‌బైక్ కంపెనీలో ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ గ్రూప్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తాను ఈ స్థాయికి వచ్చేందుకు సహాయపడిన తన భర్త, తల్లి, కుటుంబ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ 12వ సీజన్‌లో మొదటి కరోడ్‌పతి మహిళ కావడం గర్వంగా ఉందని వ్యాఖ్యాత అమితాబ్ కూడా అన్నారు.



Next Story

Most Viewed