కరెంట్ పోల్ పడి..రైతు మృతి

by  |
కరెంట్ పోల్ పడి..రైతు మృతి
X

దిశ, ఖమ్మం :
ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి వచ్చిన ఓ రైతుపై ప్రమాదవశాత్తు కరెంట్ పోల్ పడింది. తీవ్ర గాయాలపాలైన అతన్నిఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.ఈ ఘటన ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం చేగొమ్మ‌లో గురువారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..పండించిన ధాన్యాన్నివిక్రయించేందుకు రైతు వెంకన్నపై కొనుగోలు కేంద్రానికి వచ్చాడు.ఆ సమయంలోనే ధాన్యం నింపిన లారీ రీవర్స్ చేస్తుండగా కరెంట్ పోల్‌‌ను తాకింది. స్తంభం విరిగిపోయి రైతుపై పడటంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మార్గ మధ్యలో మృతి చెందినట్టు స్థానికులు వెల్లడించారు.

Next Story

Most Viewed