బావిలో పడ్డ రైతు.. కారణం ఇదే

by  |
బావిలో పడ్డ రైతు.. కారణం ఇదే
X

దిశ, కోదాడ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగలడంతో రైతు బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కోదాడ మండలం కూచిపూడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు శెట్టి రాముడు (42) గురువారం ఉదయం నారుమడికి నీళ్లు పెట్టడానికి తన వ్యవసాయ పొలానికి వెళ్లి మోటార్ వేసే క్రమంలో విద్యుత్ షాక్ గురై పక్కన ఉన్న బావిలో పడి మృతి చెందారు. సాయంత్రం 7 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి వెతకడం ప్రారంభించారు. బావిలో చెప్పులు కనపడటంతో గాలించారు. రాత్రి 11 గంటల సమయంలో రాముడి శవం దొరికింది. మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పటల్‌కు తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు.



Next Story

Most Viewed