- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీదేవి కేసు సీబీఐకి అప్పగించాలి
<p>దిశ, వెబ్డెస్క్: సినీ నటి శ్రీదేవి మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ అభిమానులు ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం కావడంతో కేసును సీబీఐ విచారణ చేపట్టింది. దీంతో సుశాంత్ కేసు దర్యాప్తులో వేంగం పెంచడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే శ్రీదేవి మృతి పై విచారణ చేయాలంటూ అభిమానులు ఉద్యమం చేపట్టారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లోని ఓ హోటల్లో శ్రీదేవి బాత్ టబ్ లో […]</p>

X
దిశ, వెబ్డెస్క్: సినీ నటి శ్రీదేవి మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ అభిమానులు ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం కావడంతో కేసును సీబీఐ విచారణ చేపట్టింది. దీంతో సుశాంత్ కేసు దర్యాప్తులో వేంగం పెంచడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలోనే శ్రీదేవి మృతి పై విచారణ చేయాలంటూ అభిమానులు ఉద్యమం చేపట్టారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లోని ఓ హోటల్లో శ్రీదేవి బాత్ టబ్ లో పడి మరణించిన సంగతి తెలిసిందే. కాగా, శ్రీదేవి మృతిపై అభిమానులకు మాత్రం ఇంకా అనుమానం పోలేదు. ఈ మృతి కేసును కూడా సీబీఐకి బదిలీ చేయాలంటూ ట్విట్టర్ వేదికగా #CBIEnquiryForSridevi అంటూ యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఆమె మృతిపై సీబీఐ దర్యాప్తు చేసి నిజాలను బయటపెట్టాలని డిమాండ్ వినిపిస్తున్నారు.
Next Story






