పుష్కరాలను తలపిస్తున్న కరోనా కర్మకాండలు

by  |
పుష్కరాలను తలపిస్తున్న కరోనా కర్మకాండలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించింది. కరోనా కాటుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇలా ఎంతో మంది బలయ్యారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో కరోనాతో చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ కరోనాతో చనిపోయిన వారికి దహనసంస్కారాలు చేయడానికి కూడా కుటుంబసభ్యులు నోచుకోలేదు. అయితే ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో కరోనాతో మరణించిన వారికి తమ కుటుంబ సభ్యులు కర్మకాండలు నిర్వహిస్తున్నారు. దీంతో పుష్కరాల సమయంలో మాత్రమే జిల్లాలో పెద్దఎత్తున కర్మకాండలు జరిపిస్తారని, కరోనా నేపథ్యంలో పుష్కరాలను తలపించే విధంగా కరోనా మృతులకు కర్మకాండలను నిర్వహిస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా కోటిలింగాల ఘాట్‌‌లో కుటుంబ సమేతంగా వచ్చి పిండప్రదానాలు చేస్తున్నారు. ఇలా జిల్లాలో రోజు రోజుకు పిండప్రదానాలు పెరుగుతున్నాయి.


Next Story

Most Viewed