బాబు ఎస్సీ,ఎస్టీలను మోసం చేశారు: చెట్టి ఫాల్గుణ

by  |
బాబు ఎస్సీ,ఎస్టీలను మోసం చేశారు: చెట్టి ఫాల్గుణ
X

దిశ ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని విశాఖ జిల్లా అరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆరోపించారు. చంద్రబాబు గిరిజనుల ద్రోహి అని అన్నారు. బాక్సైట్ తవ్వకాల పేరిట గిరిజనుల ఆస్తులను దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ముఖ్యమంత్రి జగన్ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో గిరిజనులకు భూమి పట్టాలను దివంగత వైయస్ ఇచ్చారని, ఇప్పుడు జగన్ నాలుగింతల భూమి పట్టాలను ఇచ్చి గిరిజనుల జీవితాలను మార్చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

Next Story

Most Viewed