‘ప్రభుత్వాస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్మెంట్ పూర్తి చేయాలి ’

by  |
‘ప్రభుత్వాస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్మెంట్ పూర్తి చేయాలి ’
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. పెళ్లిళ్లకు 150 మందికే అనుమతివ్వాలని సూచించారు. అలాగే తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో కొవిడ్‌ టెస్టింగ్‌కు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్‌మెంట్ పూర్తిచేయాలని ఆదేశించారు. ఎక్కడా కూడా సిబ్బంది లేరన్న మాట తనకు వినిపించకూడదని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.



Next Story

Most Viewed