- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మహబూబాబాద్ టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలు మళ్లీ నమ్మకుండా ఉద్యమ కారులందరూ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావాలని బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి ఇల్లందు కార్యకర్తల సమావేశంలో పాల్గొనటానికి వెళుతోన్న ఈటల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కేవలం తన అడుగులకు మడుగులొత్తే వాళ్లకే పదవులు ఇస్తున్నారని విమర్శించారు. స్వరాష్ట్రంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఎవరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఏడేండ్ల నుంచి కేసీఆర్ మాటలకు, చేతలకు అసలు సంబంధమే ఉండటం లేదని, ప్రతిసారీ మాయమాటలు, మోసపు మాటలు చెబుతూ గట్టేక్కుతాడని అన్నారు.
మరోసారి కేసీఆర్ మాటలు నమ్మి ఉద్యమ కారులు మోసపోవద్దని, వెంటనే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఏంటో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందని వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. కేసీఆర్ గద్దె దిగే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. పార్టీ అభివృద్ధికి కింది స్థాయి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచందర్ రావు, యాప సీతయ్య, సిరికొండ సంపత్, చెరుకూరి వెంకన్న, శ్రీనివాస్, పల్లె సందీప్ తదితరులు పాల్గొన్నారు.