ఈటల చేరికకు వారంలో ముహూర్తం

by  |
ఈటల చేరికకు వారంలో ముహూర్తం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమయింది. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన ఆయన సోమవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఈటలతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జి తరుణ్ ఛుగ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఈటల వ్యవహారంలో జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్రమంత్రి అమిత్​షాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్వల్ప అనారోగ్యంతో ఉన్న అమిత్​షా నుంచి ఇంకా అపాయింట్​మెంట్​ రాకపోవడంతో వెయిటింగ్​లో ఉన్నట్లు సమాచారం.

మంగళవారం అమిత్​షా అపాయింట్​మెంట్​ వస్తే భేటీ అవుతారని, అనంతరం ఢిల్లీ నుంచి హుజూరాబాద్ చేరుకున్న తర్వాత తన అనుచరులతో ఈటల సమావేశం అవుతారని ఈటల వర్గీయులు చెప్పుతున్నారు. అనంతరం బీజేపీలో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారంటున్నారు. అయితే ముందుగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఈటల రాజేందర్​ రాజీనామా చేస్తారని బీజేపీ నేతలు చెప్పుతున్నారు. ఐదారు రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈటల ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మారుతున్న రాజకీయ పరిణామాలను టీఆర్ఎస్ పార్టీ కూడా నిశితంగా గమనిస్తోంది. ఈటల బీజేపీలో చేరిన తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగనున్నాయనే రాజకీయ చర్చ కూడా సాగుతోంది.

కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్​ రాజీనామా చేస్తారా… లేకుంటే కరోనా పరిస్థితుల తర్వాతే ఉంటుందా అనేది కొంత చర్చగా మారింది. కానీ ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్​ దీనిపై ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం రాజీనామా చేయనని, కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాతే రాజీనామా ఉంటుందన్నారు. కానీ బీజేపీలో చేరిన తర్వాతే రాజీనామా చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed