నిత్యావసరాలపై ఆందోళన వద్దు: కేంద్రం

by  |
నిత్యావసరాలపై ఆందోళన వద్దు: కేంద్రం
X

భారతీయులను కరోనా వైరస్​ కలవరపెడుతోంది. దీంతోపాటు 21 రోజుల లాక్​డౌన్​పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అందరి ప్రశ్న నిత్యావసరాలపైనే. ముఖ్యంగా ఆహార ఏర్పాట్లపై అనేక సందేహాలు ఉన్నాయి. అయితే, ప్రజలు తమ సందేహాలు విడిచిపెట్టాలని కేంద్రం చెబుతోంది. ఆహారం విషయంలో అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నట్టు కేంద్ర ఆహారశాఖ మంత్రి రామ్​ విలాస్​ పాసవాన్​ తెలిపారు. మార్కెట్లలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు. వైరస్​ పేరుతో ఉత్పత్తిదారులు, ట్రేడర్లు ధరలను ఇష్టానుసారంగా పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పాసవాన్​. నిత్యావసర వస్తువుల కొరత ఉండకుండా.. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్టు స్పష్టం చేశారు. 21 రోజుల లాక్​డౌన్​ నేపథ్యంలో కరోనాపై వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు పలు సూచనలు జారీ చేసింది.

సూచనలేంటంటే..

  • అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ రాష్ట్రంలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
  • ముఖ్యమైన, అవసరమైన వస్తువులకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలపాలి.
  • అవసరమైన వస్తువుల సరఫరా కొనసాగించడానికి వీలుగా జిల్లా పరిపాలన, పోలీసుల మధ్య సమన్వయం ఉంచేందుకు ఒక నోడల్ అధికారిని నియమించాలి.
  • ఆహారం, మందులు, నిత్యావసరాలపై స్థానిక పాలనా యంత్రాంగం ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వాలి.
  • ఎలాంటి వదంతులను నమ్మవద్దని ప్రజలకు చెప్పి.. వారిలో భరోసా నింపాలి.
  • ఎక్కడా ఆహార, నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా స్థానిక పాలనా యంత్రాంగం చర్యలు చేపట్టాలి.
  • Tags : corona out break, lockdown, essential, there is no trouble for necessities, central


Next Story

Most Viewed