సానుకూలంగా కీలక రంగాల ఉత్పత్తి!

by  |
సానుకూలంగా కీలక రంగాల ఉత్పత్తి!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి ఈ ఏడాది జనవరిలో 0.1 శాతం పెరిగింది. శుక్రవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి వరుసగా మూడు నెలలు ప్రతికూలత తర్వాత స్వల్పంగా కోలుకున్నాయి. ముఖ్యంగా.. ఎరువులు, ఉక్కు, విద్యుత్ రంగాల మెరుగైన ప్రదర్శనతో ఈ పెరుగుదల నమోదైంది.

గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి మౌలిక రంగా ఉత్పత్తి 1.3 శాతం క్షీణతను నమోదు చేసిన సంగతి తెలిసిందే. సిమెంట్ ఉత్పత్తి జనవరిలో 5.9 శాతానికి పడిపోయింది. బొగ్గు ఉత్పత్తి 1.8 శాతం క్షీణించింది. ముడి చమురు 4.6 శాతం, సహజ వాయువు ఉత్పత్తి 2 శాతం పడిపోయింది. పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి కూడా జనవరి 2020 తో పోలిస్తే 2.6 శాతం క్షీణించింది. ఎరువులు 2.7 శాతం, ఉక్కు 2.6 శాతం, విద్యుత్ రంగంలో ఉత్పత్తి 5.1 శాతం పెరిగింది.



Next Story

Most Viewed