- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: ఈనాడు దిన పత్రికలో సీనియర్ ఫోటో జర్నలిస్ట్గా పనిచేస్తున్న రాజమౌళి (57) ఆకస్మికంగా మరణించారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. రాజమౌళి మృతి పట్ల సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, క్రాంతి కిరణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.రాజమౌళి భౌతికకాయానికి పలువురు జర్నలిస్టులు సైతం నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు రూ.లక్ష సాయం ప్రకటించారు.తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనుమళ్ళ గంగాధర్, కేఎన్ హరి వేరొక ప్రకటనలో సంతాపం తెలిపారు.
Next Story