భారత్-పాక్ యుద్ధం ఎఫెక్ట్.. సీఏ ఫైనల్ పరీక్షలు వాయిదా..!

by Phanindra |
భారత్-పాక్ యుద్ధం ఎఫెక్ట్.. సీఏ ఫైనల్ పరీక్షలు వాయిదా..!
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా జరగాల్సిన ఛార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ఫైనల్ పరీక్షలపై భారత్, పాక్ యుద్ధం ప్రభావం పడింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్స్ (పీక్యూసీ) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. ఈ పరీక్షలు మే 9 నుంచి 14 మధ్య జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఐసీఏఐ ప్రకటించింది.



Next Story

Most Viewed