సృష్టికే వన్నె తెచ్చిన యాదగిరి గుట్ట

by Disha edit |
సృష్టికే వన్నె తెచ్చిన యాదగిరి గుట్ట
X

రాతి దేవాలయ నిర్మాణానికి రెండులక్షల టన్నుల కృష్ణ శిలను ఉపయోగించారు. ఈ రాయిని ప్రకాశం జిల్లా గురిజేపల్లి, గుంటూరు జిల్లా కమ్మవారిపాలెం నుంచి తీసుకువచ్చారు. ప్రధాన స్థపతి తో పాటు పదకొండు మంది ఉప స్థపతులు, రెండువేల మంది శిల్పులు తొలి సంవత్సరం పని చేశారు. తరువాత సంవత్సరంలో పదిహేను వందల మంది శిల్పులు విధులు నిర్వహించారు. ఆలయం పునర్ నిర్మాణానికి రూ. 1200 కోట్లు ఖర్చు చేశారు. ప్రధానాలయ పునర్నిర్మాణం కోసం వైటీడీఏ రూ.248 కోట్లు ఖర్చు చేసింది. ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా లక్ష్మీ నరసింహ స్వామి గుడి నిర్మితమైంది. వేంచేపు మండపం, బ్రహ్మోత్సవ మండపం, అష్ట భుజి ప్రాకార మండపాలను తీర్చిదిద్దారు.

యాదగిరి గుట్ట క్షేత్రం అనంత కోటి స్వర్ణ కాంతులీనుతున్నది. సీఎం కేసీఆర్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవంతో ఈ ఆలయంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. నవ యాదగిరిగుట్టను జాతికి పునరంకితం చేసిన సీఎం కేసీఆర్ ప్రధాన ఆలయంలో తొలి పూజలు చేశారు. 'శ్రీకర, శుభకర, ప్రణభ స్వరూప, శ్రీ లక్ష్మీ నరసింహ నమో నమః' అంటూ జయ జయ ధ్వానాలు మారుమోగాయి. యావత్ తెలంగాణ భక్త జనం స్వామికి ప్రణమిల్లుతున్నది.

స్వామికి నివేదించుకుంటే ఎంతటి కష్టాలు అయినా తొలగిపోతాయనేది అనేది తెలంగాణ ప్రజల నమ్మకం. సర్వజన హితం కోరే నేత కేసీఆర్ ఆ లక్ష్మీనరసింహుని అనుగ్రహంతో ఆలయ పునర్ నిర్మాణ వైభవాన్ని నిరాటంకంగా పూర్తి చేశారు. పునర్నిర్మాణంతో యాదగిరిగుట్ట దివ్య క్షేత్రంగా, ఆధ్యాత్మిక కళా క్షేత్రముగా విరాజిల్లనుంది. ముక్కోటి దేవతల స్వర్గ నిలయం. ఆధ్యాత్మిక దైవ మందిరం. ఉగ్ర, గండభేరుండ, జ్వాల, యోగానంద, లక్ష్మీ సమేత అయిదు రూపాలలో నరసింహుడిని కొలుస్తారు.

తెలంగాణ జనుల భాగ్యం

దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నది. లక్ష్మీ నరసింహ పుణ్యభూమిని దర్శంచుకోవడానికి సమస్త జనులు తరలి వస్తున్నారు. తెలంగాణ గడ్డ మీద లక్ష్మీ నృసింహ స్వామి కొలువై ఉండటం తెలంగాణ జనుల భాగ్యం. యాదగిరి గుట్టలో ఎటు చూసినా భక్తిభావంతో జనం మనసు ఉప్పొంగుతుంది. పదునాలుగు లోకములన్నీ మొక్కే జ్వాల నరసింహ స్వామీనీ దర్శించడానికి భక్త జనులు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలి వస్తుండటంతో తెలంగాణ మట్టి పులకించిపోతున్నది. మన ఇల్లు, మన ఊరు, సమాజం, దేశం, ప్రపంచమంతా సంతోషంగా ఉండాలి.

భక్తి పారవశ్యం తెలంగాణ మట్టిలోనే కనిపించింది. ఎంతో గొప్పగా తీర్చిదిద్దిన దివ్య మందిరాన్ని చూసే గొప్ప అవకాశం సీఎం కేసీఆర్ ద్వారా లభించింది. కోట్లది రూపాయలు కేటాయించి ఆలయాలను కనులవిందుగా అభివృద్ధి పరుస్తున్నారు.ఆ స్వామి దర్శనం కోసం మా బాపుతో కలిసి ఏటా అందరం యాదగిరి గుట్టకు వెళుతుంటిమి. 30 ఏండ్ల క్రితం చూసిన, 3 ఏండ్ల క్రితం వరకు చూసిన యాదగిరి గుట్ట క్షేత్రాన్ని ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆలయం ముందు ఫోటో దిగుతుంటే, అసలు ఎక్కడ ఉన్నాం? గతంలో చూసిన యాదాద్రి, ఇప్పటి క్షేత్రం అసలు కలయా? నిజమా? అనిపించింది.

గత కాలపు వైభవం

సంకల్ప యోగులు, పల్లవ, చోళ, త్రిభువన మల్లుడు, శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయ రాజులు, సింగ భూపాలుడి కాలంలో నాటి ఆలయం విరాజిల్లితే, కేసీఆర్ దానిని సువర్ణమయంగా, భక్త కోటి కోసం నృసింహ క్షేత్రపురమును సృష్టించారు. సర్వ దేవ దేవతలను స్మరించుకునే భావన తెలంగాణ భూమిలో కనిపిస్తుంది. మనిషిని మనిషిగా, మనసుతో ప్రేమించినప్పుడు ప్రేమ, ఆప్యాయతల ముందు మతం, కులం కనబడవు. అందరూ బాగుండాలని కోరుకునుదే మతం, మతం తప్పు చేయాలని చెప్పదు, ఏ కులం కూడా కొట్లాడుకోవాలని చూడదు.

వేములవాడ, భద్రాచలం, మేడారం సమ్మక్క సారక్క, జోగులాంబ వంటి దేవాలయాలను కోట్లాది రూపాయలు కేటాయించి అభివృద్ధి పరుస్తున్నారు. ముక్తీశ్వరుడి సన్నిధిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు. గోదారమ్మ జలాశయలన్నింటికీ జలదేవతల నామకరణం చేశారు. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజిగా, అన్నారం సరస్వతి బ్యారేజిగా, సుందిల్ల పార్వతీ బ్యారేజీగా, నంది మేడారం నందీశ్వరుడిగా, రాజన్నసాగర్, అన్నపూర్ణ సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, భక్త రామదాసు, సీతారామ ప్రాజెక్ట్, తుపాకుల గూడెం సమ్మక్క సారక్క బ్యారేజిగా తెలంగాణలో ఎక్కడ చూసిన జలాశాయలకు దేవతా మూర్తుల పేర్లు పెట్టేశారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ముందడుగులు వేస్తున్నది.

అపురూప శిల్ప సౌందర్యం

రాతి దేవాలయ నిర్మాణానికి రెండులక్షల టన్నుల కృష్ణ శిలను ఉపయోగించారు. ఈ రాయిని ప్రకాశం జిల్లా గురిజేపల్లి, గుంటూరు జిల్లా కమ్మవారిపాలెం నుంచి తీసుకువచ్చారు. ప్రధాన స్థపతి తో పాటు పదకొండు మంది ఉప స్థపతులు, రెండువేల మంది శిల్పులు తొలి సంవత్సరం పని చేశారు. తరువాత సంవత్సరంలో పదిహేను వందల మంది శిల్పులు విధులు నిర్వహించారు. ఆలయం పునర్ నిర్మాణానికి రూ. 1200 కోట్లు ఖర్చు చేశారు. ప్రధానాలయ పునర్నిర్మాణం కోసం వైటీడీఏ రూ.248 కోట్లు ఖర్చు చేసింది.

ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా లక్ష్మీ నరసింహ స్వామి గుడి నిర్మితమైంది. వేంచేపు మండపం, బ్రహ్మోత్సవ మండపం, అష్ట భుజి ప్రాకార మండపాలను తీర్చిదిద్దారు. వంద సంవత్సరాలకు ముందు నిర్మించిన అనుభూతి భక్తులకు కలిగే విధంగా నిర్మించారు. ప్రస్తుత గర్భాలయాన్ని అలాగే ఉంచి దాని చుట్టూ పదునైన గోడను నిర్మించారు. ఆలయంలోకి భక్తులు సులువుగా వెళ్లేందుకు వీలుగా ముఖ ద్వారాన్ని కూడా వెడల్పు చేశారు. గతంలో పదివేల మంది భక్తులకు వీలుండే చోటును ఇప్పుడు ముప్పయి నుంచి నలభై వేల మంది వచ్చిపోయేందుకు వీలుగా విస్తరించారు. గుట్ట మీద విష్ణు పుష్కరణి, గుట్ట కింద లక్ష్మి పుష్కరిణి ఏర్పాటు చేశారు. లోక సమస్త సుఖినోభవంతు.

చిటుకుల మైసారెడ్డి

సీనియర్ జర్నలిస్ట్, సిద్దిపేట

94905 24724

Next Story

Most Viewed