వాటిని అమ్మితే కేసులు తప్పవు : డీఎస్పీ లక్ష్మీనారాయణ

by  |
వాటిని అమ్మితే కేసులు తప్పవు : డీఎస్పీ లక్ష్మీనారాయణ
X

దిశ.తాండూర్: వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ ఆదేశానుసారం తాండూరు పట్టణంలో గుట్కాలను, నిషేధిత పొగాకును అమ్ముతున్న కిరాణా షాపులు, పాన్ షాపులపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి ఉక్కుపాదం మోపారు. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నిషేధించినటువంటి పొగాకు జర్దా , గుట్కా తదితర వాటికి విక్రయిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి ఎస్ఐలు గిరి, సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story