అక్కడ రోడ్డును  తవ్వీ పనిని మరిచిన జలమండలి అధికారులు..

by  |
అక్కడ రోడ్డును  తవ్వీ పనిని మరిచిన జలమండలి అధికారులు..
X

దిశ, నాచారం: జలమండలి అధికారుల నిర్లక్ష్యం వల్ల విలువైన తాగునీరు రోడ్డు పై పొంగి పొర్లుతుంది. అసలే కాలనీ లో నీటి ఎద్దడి సమస్యతో ప్రజలు సతమతం అవుతుంటే.. మరో వైపు తాగునీటి లీకేజీలతో గ్యాలన్ల కొలది నీరు వృధాగా వెల్లతోంది. మల్లాపూర్ వీఎన్ ఆర్ గార్డెన్ సమీపంలో వాగ్దేవి స్కూల్ సమీపంలో త్రాగు నీరు కొద్ది రోజులుగా వృధాగా పారుతుంది. మరమ్మతుల కోసం రోడ్డు తవ్వారు. కానీ మరమ్మతులు మాత్రం మరిచారు. దీంతో రోడ్డుపై నీరు వృధాగా పారుతుంది. ఈ విషయమై జలమండలి ఏ ఈ సాయిబాబాను వివరణ కోరగా.. మరమ్మతులు చేపట్టనున్నట్లు చెప్పారు.

Next Story