పేదలకు అండగా ఉంటాం : ప్రతాప్

by  |
పేదలకు అండగా ఉంటాం : ప్రతాప్
X

దిశ, కంటోన్మెంట్: లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కొల్పోయిన పేద కుటుంబాలకు అండగా ఉంటామని కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షులు జంపనప్రతాప్, భానుక నర్మద మల్లీకార్జున్‌లు అన్నారు. ఆదివారం బోయిన్‌పల్లి సీతారాంపూర్‌లో శ్రీనివాస కాలనీ, భవానీనగర్ తదితర ప్రాంతాలకు చెందిన పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం, మాస్కులు, కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను స్వీయ నియంత్రణతోనే ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పరిసరా పరిశుభ్రతతోనే అంటు వ్యాధులు దరి చేరకుండా చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా కంటోన్మెంట్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. డ్రయినేజీ, తాగునీటి వ్యవస్థలు అధ్వాన్నంగా తయారయ్యాయని త్వరలోనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు.



Next Story

Most Viewed