రేపటి నుంచి బ్రూసెల్లోసిస్ నివారణ టీకాల పంపిణీ

by  |
రేపటి నుంచి బ్రూసెల్లోసిస్ నివారణ టీకాల పంపిణీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి జనవరి 2వరకు బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లు పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్​ లక్ష్మారెడ్డి ప్రకటించారు. 4నుండి 8నెలల వయసు గల ఆవు, గేదె జాతి ఆడ దూడలకు ఈ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఈవ్యాధి బృసెల్లా అనే బ్యాక్టీరియా ( సూక్ష్మక్రిమి) ద్వారా అనేక రకాల జంతువులు గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, కుక్కలు, జింకలు, అడవి జంతువులు, మనుషులకు సోకుతుందన్నారు. ఈవ్యాధి తక్కువ ఉష్ణోగ్రతల్లో, అపరిశుభ్రమైన వాతావరణ పరిస్థితులలో పశువులకు సోకుతుందని, పశువు సంపర్కం ద్వారా కూడా ఇతర పశువులకు, ఈనిన తర్వాత మావి, గర్భస్రావ ద్రవాల ద్వారా, నోటిలో, కంటిలో పడి, మనుషులకు, పశువులకు వ్యాపిస్తుందని హెచ్చరించారు.



Next Story

Most Viewed