మరోసారి తెరపైకి దిశ ఎన్‎కౌంటర్ చిత్రం

by  |
మరోసారి తెరపైకి దిశ ఎన్‎కౌంటర్ చిత్రం
X

దిశ, వెబ్ డెస్క్: దిశ నిందితుల ఎన్‎కౌంటర్ చిత్రం మరోసారి తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు జ్యూడిషియల్ కమిషన్‎ను దిశ నిందితుల కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. రాం గోపాల్ వర్మ తీస్తున్న దిశ ఎన్‎కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సినిమాలో తమ వాళ్లను విలన్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ చిత్రంతో తాము జీవించే స్వేచ్ఛకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కమిషన్‎కు విరుద్ధంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారని.. విచారణ జరుగుతుంటే సినిమా ఎలా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సినిమాను ఆపాలని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.


Next Story

Most Viewed