నేటితో ముగియనున్న కుంభమేళా.. పోటెత్తిన భక్తజనం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-26 02:38:47  IST  )

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా నేటితో ముగియనుండటంతో భక్తులు పొటెత్తారు.

నేటితో ముగియనున్న కుంభమేళా.. పోటెత్తిన భక్తజనం
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Kumbh Mela) నేటితో ముగియనుండటంతో భక్తులు పొటెత్తారు.మహా శివరాత్రి (Shivaratri), కుంభమేళా చివరి రోజు కావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో త్రివేణి సంగమం ఘాట్లు 'హర హర మహాదేవ్' నామస్మరణలతో మార్మోగుతున్నాయి.

ఈ కుంభమేళాలో నేడు చివరి అమృత్‌ స్నానం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా సన్నాహాలు చేశారు. ట్రాఫిక్‌ నియంత్రణకు ఈ ప్రాంతాన్ని ఇప్పటికే నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే జనం అటు వారణాసి, ఇటు అయోధ్యలను సందర్శిస్తున్నారు. దీంతో ఆ ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

కాగా, పుష్య పౌర్ణమి జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా మహా శివరాత్రి ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఇప్పటివరకు 64 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. ఈ రోజు మహా శివరాత్రి కావటం, చివరి రోజు కావటంతో దాదాపు 5 కోట్లకు పైగా భక్తులు కుంభమేళా విచ్ఛేసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కుంభమేళా ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనం అయ్యేలా ప్రయాగ్‌రాజ్‌ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు బుధవారం 350 రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

Next Story