పూరీ జగన్నాథ రథయాత్రకు వేళాయె.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?

by Yella Dhawani Reddy |

జగత్తును ఏలే జగన్నాథుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రలతో కలసి కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం పూరీ. ఇక జగన్నాథుడి రథం కదిలితే, పూరీ తీరాన భక్తిసంధ్యలు అలలేగుతుంటాయి! ప్రతి ఏడాది ఆషాఢమాసంలో ఇక్కడ జరిగే రథయాత్ర విశేష ఆకర్షణగా నిలుస్తుంది.

పూరీ జగన్నాథ రథయాత్రకు వేళాయె.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఒడిశాలోని పూరీ తీరాన జగత్తును ఏలే ఆ జగన్నాథుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కొలువె ఉన్నాడు. అందుకే హిందువులు పూరీ తీర్థయాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక ఇక్కడ ప్రతి ఏడాది ఆషాఢమాసంలో అత్యంత ఘనంగా నిర్వహించే రథయాత్ర విశేష ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మహోత్సవాన్ని జీవితంలో ఒక్కసారైనా ప్రత్యక్షంగా చూసే భాగ్యం అందుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. ఈ వేడుకను చూసేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. ఇక ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ఎప్పుడు జరుగుతుంది. ఆ విశేషాలు తెలుసుకుందాం.

జగన్నాథుడి రథయాత్ర ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శుక్ల పక్షం విధియ తిథి నుండి ప్రారంభమవుతుంది. అంటే ఈ ఏడాది జూన్ 27 నుంచి రథయాత్ర ప్రారంభంకానుంది. ఇది 9 రోజులపాటు జరుగుతుంది. ఈ ఉత్సవానికి సంబంధించిన అనేక శుభకార్యాలు ఇప్పటికే మొదలయ్యాయి. సాధారణంగా హిందూ దేవాలయాలలో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. అయితే పూరిలో గర్భగుడిలో ఉండే జగన్నాథుడు, బలరాముడు, సుబధ్రల మూలవిరాట్ విగ్రహాలే ప్రత్యేకంగా తయారు చేసిన మూడు రథాల్లో ఊరేగింపులో భాగంగా ఉంటాయి. ఈ రథయాత్రలో మరో విశేషం ఏమిటంటే.. ప్రతి సంవత్సరం కొత్త కలపతో రథాన్ని తయారు చేస్తారు. ప్రతి రథం కోసం దాదాపు 1,000 చెక్క ముక్కలను ఉపయోగిస్తారు. ఈ భారీ నిర్మాణాలు ఎలాంటి లోహపు మేకులు లేదా ఫాస్టెనర్లు ఉపయోగించకుండా తయారుచేస్తారు. మహారాణులు అని పిలువబడే కళాకారుల తరతరాలుగా అందించబడిన సాంప్రదాయ కలపడం పద్ధతులను ఉపయోగించి వీటిని రూపొందిస్తారు. వీటి నిర్మాణానికి దాదాపు రెండు నెలలు పడుతుంది.

ఈ రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల దర్శనం తర్వాత గుండిచా ఆలయానికి చేరుకుంటారు. ఇది తన అత్త నివాసం అని స్థానికులు చెబుతారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత, భగవంతుడు తన తల్లి తయారు చేసిన రుచికరమైన వంటకాలను స్వీకరిస్తాడు. ఆ తర్వాత ఏడు రోజుల పాటు ఈ ఆలయంలో విశ్రాంతి తీసుకుంటాడు. ఈ సందర్భంగా జూన్ 26న గుండిచా ఆలయం శుభ్రం చేయబడుతుంది. ఆమరుసటి రోజు అంటే జూన్ 27న రథయాత్రను నిర్వహిస్తారు. రథయాత్ర తొమ్మిది రోజుల పాటు కొనసాగిన తిరుగు ప్రయాణం జూలై 5న సాగుతుంది. ఈ సందర్భంలో జగన్నాథుడు మళ్ళీ సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రతో కలిసి శ్రీమందిర్‌కు బయలుదేరుతాడు.

Next Story