శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

by Yella Dhawani Reddy |

తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది.

శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి పెరిగిపోయింది. దీంతో గురువారం ఉదయం స్వామివారి దర్శనం కోసం వేచి చూసే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక బుధవారం శ్రీవారిని మొత్తం 75,688 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 29,099 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టీటీడీకి రూ.4.45 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Next Story