తిరుమల భక్తులకు భారీ గుడ్ న్యూస్..!

by Disha Web Desk 9 |
తిరుమల భక్తులకు భారీ గుడ్ న్యూస్..!
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుత అవకాశం కల్పించింది. ఈ రోజు (నవంబరు23) నుంచి హిందూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా అలిపిరిలోని సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా టీటీడీ ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేసింది. కాగా టికెట్‌ ధర రూ.1000 గా నిర్ణయించారు. అయితే టీటీడీ ఒక టికెట్‌పై ఇద్దరిని అనుమతిస్తున్నారు. రోజుకు 100 టికెట్లు.. వీటిలో 50 ఆన్‌‌లైన్.. మరో 50 ఆఫ్‌లైన్ టికెట్లు ఉంటాయి. అలాగే అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో ఈ రోజు నుంచి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని టీటీడీ ప్రారంభిస్తోంది. ఇవాళ ఉదయం 9 గంటలకు హోమం ప్రారంభం కానుండగా.. నిరంతరాయంగా శ్రీవారి పాదాల వద్ద ప్రతి రోజు ఈ హోమం కొనసాగుతుంది. పెళ్లిరోజు, పుట్టిన రోజు , ఇతర విశేష రోజుల సందర్బంగా భక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చి హోమం చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది. ప్రస్తుతం ఆఫ్ లైన్ లో 50, ఆన్ లైన్ లో 50 టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Next Story