చర్చలు విఫలం.. ఆరోగ్య శ్రీ సేవల బంద్ కంటిన్యూ

by srinivas |
చర్చలు విఫలం.. ఆరోగ్య శ్రీ సేవల బంద్ కంటిన్యూ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే నెట్ వర్క్ ఆస్పత్రుల యాజమాన్యంతో ఆరోగ్య శ్రీ సీఈవో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ సాయంత్రం జూమ్ యాప్ ద్వారా చర్చలు జరిపారు. రూ. 800 కోట్ల మేర పెండింగ్ బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. అయితే ఇందుకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో విముఖత చూపారు. దీంతో ప్రైవేటు స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవల బంద్‌ను కొనసాగించాలని యాజమాన్యాలు నిర్ణయించారు. ఇప్పటికే ఓ సారి చర్యలు జరిపారు. అప్పుడు కూడా సఫలం కాలేదు. దీంతో మరోసారి కూడా ఆస్పత్రుల యాజమాన్యంతో ఆరోగ్య శ్రీ సీఈవో చర్చించారు. కాని సయోధ్య కుదరలేదు. దీంతో ఆరోగ్య శ్రీ సేవల బంద్‌ను ఆస్పత్రులు కొనసాగించనున్నాయి.

కాగా ఏపీలో రోగులకు ప్రైవేటు స్పెషాలిటీ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నాయి. కరోనా సమయంలో చికిత్సలు అందించాయి. అయితే అప్పటి నుంచి కూడా ఆస్పత్రులకు బకాయిలు చెల్లించలేదు. దీంతో ఆరోగ్య శ్రీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం దిగొచ్చింది. రూ. 203 కోట్లు విడుదల చేసింది. కానీ ప్రైవేటు స్పెషాలిటీ ఆస్పత్రుల యాజమాన్యం ఒప్పుకోలేదు. కనీసం రూ. 800 కోట్ల అయినా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. కానీ అందుకు ప్రభుత్వం దిగి రావడంలేదు. బుధవారం సాయంత్రం జరిపిన చర్చలు సఫలం కాదు. దీంతో రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవల బంద్ కంటిన్యూ కానుంది.

Next Story