- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
AP News:టీడీపీ నేత డీజీపీకి సంచలన లేఖ..
దిశ ప్రతినిధి,గుంటూరు: ఎన్నికలు జరిగిన రోజున ఈవీఎంను బద్దలు కొట్టడం అంటే రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు. పోలింగ్ జరిగిన నాటి నుంచి పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బుధవారం టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా మహేశ్వర రావు, జూలకంటి బ్రహ్మ రెడ్డి, ఏఎస్.రామకృష్ణ, మన్నవ సుబ్బారావు ఇతర నాయకులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి అచ్చన్న రాసిన లేఖను అందించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులపై వరుసగా దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రత్యర్థులపై పిన్నెల్లి బ్రదర్స్ అతని అనుచరులు కలిసి దాడులకు తెగబడ్డారు. పోలింగ్ రోజు వారు సృష్టించిన అరాచకాలకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ అరాచకాలన్నీ పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతున్నా పోలీసులు వైసీపీ గూండాలకు అడ్డు చెప్పడం మానేసి అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. పోలింగ్ రోజున పిన్నెల్లి స్వయంగా ఈవీఎం ను బద్దలు కొట్టడం, టీడీపీకి ఓటు వేసిన సానుభూతి పరుల పై దాడులకు పాల్పడటం వంటి ఘటనలు వైసీపీ ఓటమి పాలవుతుందని భయంతో అరాచకాలకు సృష్టిస్తున్నారు. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్, పోలీసు వ్యవస్థ పిన్నెల్లి పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.