క్రోధి నామ సంవత్సరంలో 3 రాజయోగాలు.. ఆ రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు .. మీ రాశి ఉందా?

by Disha Web Desk 10 |
క్రోధి నామ సంవత్సరంలో 3 రాజయోగాలు.. ఆ రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు .. మీ రాశి ఉందా?
X

దిశ, ఫీచర్స్: హిందూ నూతన సంవత్సరం ఉగాది పండుగతో ప్రారంభమవుతుంది. పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరం కుజుడు అధిపతిగా, శని మంత్రిగా ఉంటాడు. ఈ కారణంగానే ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో మూడు అత్యంత శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. చైత్ర నవరాత్రులలో భాగంగా అమృత సిద్ధి యోగం, శశా రాజయోగంతో పాటు మరో రాజయోగం కూడా ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైన అమృత సిద్ధ యోగం ఈ రోజున ఏర్పడింది. ఇది రోజంతా కొనసాగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో ఆ రెండు రాశుల వారు విపరీతమైన ధన లాభాలు పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మిధున రాశి:

ఈ క్రోధినామ సంవత్సరంలో మిథునరాశి వారు అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా.. ఈ రాశి వారు పూర్వీకుల ఆస్తులను పొందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వారి ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ కారణంగా, మీరు మీ కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. విదేశాలకు వెళ్లాలనుకునే కల నెరవేరుతుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

సింహ రాశి:

సింహ రాశివారు ఈ సంవత్సరం మిశ్రమ లాభాలు పొందుతారు. ముఖ్యంగా, ఈ సమయంలో పదోన్నతి పొందడమే కాకుండా , వారి జీతాలు కూడా పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఇది మీ ఆనందాన్ని కూడా పెంచుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.


Next Story

Most Viewed