బోనాలు ఇళ్లలోనే జరుపుకోండి

by  |
బోనాలు ఇళ్లలోనే జరుపుకోండి
X

దిశ, సికింద్రాబాద్: నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలతో సహా జంట నగరాల్లో జరిగే బోనాల వేడుకలను ప్రజలు తమ ఇళ్లలోనే జరుపుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఏటా చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో జరిగే బోనాల వేడుకలకు లక్షల మంది భక్తులు హాజరవుతారు. కానీ, ప్రస్తుతం కరోనా వల్ల ఈ వేడుకలను నిర్వహించడం లేదన్నారు. ప్రజలు తమ ఇళ్లలోనే బోనాలు జరుపుకోవాలని, ఆలయాలకు రావద్దని పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed