ఢిల్లీ అల్లర్లు: 47కు చేరిన మృతులు

by  |

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో చెలరేగిన అల్లర్ల ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరింది. ఆదివారం డ్రైనేజీలో మరో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటివరకూ 167 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. 800 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో శాంతియుత వాతావరణం నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

Next Story

Most Viewed