డీసీఎం బోల్తా.. ఒకరు మృతి

by  |
డీసీఎం బోల్తా.. ఒకరు మృతి
X

దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక – పెద్ద చీకోడ్ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారి పక్కన ఇంటర్ నెట్ కనెక్షన్ కోసం తీసిన మట్టికుప్పపై ఎక్కడంతో డీసీఎం బోల్తాపడింది.

దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతున్ని చింతమడక గ్రామానికి చెందిన పిట్ల రాజు గా గుర్తించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఎల్లప్ప గారి లక్ష్మణ్ అనే వ్యక్తిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed