ప్రాణం తీసిన అజాగ్రత్త.. అక్కడికక్కడే మృతి..

by  |
Nageshwara Rao
X

దిశ, చిట్యాల: అజాగ్రత్తగా వాహనం నడిపి ముందు వెళుతున్న లారీని డీసీఎమ్ ఢీ కొట్టడంతో డీసీయం డ్రైవర్ మృతి చెందిన ఘటన శనివారం చిట్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక బస్ స్టేషన్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా, గోపాలపురం మండలం, కొవ్వూరు పాడు గ్రామానికి చెందిన దగ్గు నాగేశ్వరావు(35) హైదరాబాద్ నుండి విశాఖపట్నంకు డీసీయం కెమికల్ లోడ్‌తో వెళ్తు్న్నాడు. శనివారం తెల్లవారుజామున చిట్యాల పట్టణ కేంద్రంలోని బస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని వెనుక నుండి డీసీయం ఢీ కొట్టింది. ఈ సంఘటనలో డీసీయం డ్రైవర్ నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.



Next Story

Most Viewed