లండన్‌లో జాబ్ అంటూ సైబర్ నేరగాళ్ల మోసం

by  |

దిశ, మెదక్: సిద్దిపేట సాజిత్‌పురాకు చెందిన యువకుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. హోటల్‌ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న రాఘవేందర్‌‌కు కొద్దిరోజుల క్రితం లండన్‌లో జాబ్ వచ్చిదంటూ మెయిల్ వచ్చింది. నెలకు రూ.11లక్షల జీతమని తదుపరి మెయిల్ చాటింగ్‌లో చెప్పారు. దీనికి అడ్మిషన్ ఫీజు రూ.28,500, వీసాకు రూ.80వేలని, ఇతర ఖర్చులు కలుపుకొని మొత్తం రూ.2.26లక్షలు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో వేశాడు. కొద్దిరోజుల తర్వాత ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


Next Story

Most Viewed