భారత్ బయోటెక్ సీఎండీతో సీఎస్ కీలక సమావేశం

by  |
భారత్ బయోటెక్ సీఎండీతో సీఎస్ కీలక సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, భారత్ బయోటెక్ సీఎండీ క్రిష్ణా ఎల్లాతో మంగళవారం బీఆర్కే భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. కోవిడ్-19 వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేపట్టటానికి తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక డోసులను సరఫరా చేయాలని, రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దీంతో భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణాఎల్లా సానుకూలంగా స్పందించినట్టు సీఎస్ తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, భారత్ బయోటెక్ డైరెక్టర్ డా.సాయి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed