బ్రేకింగ్.. బీజేపీ ఎంపీ ఇంటిపై బాంబు దాడి.. స్వల్ప గాయాలు

by  |
BJP
X

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ ఎంపీ ఇంటి వద్ద బాంబు దాడి జరగడం కలకలం సృష్టించింది. బెంగాల్‌లోని భారక్‌పూర్ నియోజకవర్గ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎంపీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

కానీ బాంబు దాడిలో ఎంపీ ఇంటి వద్ద డ్యూటీలో ఉన్న CRPF జవానుకు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున మూడు భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో అర్జున్ సింగ్ ఇంటి వద్ద వరుసగా మూడు బాంబులు విసిరినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం అంతా పొగ అలుముకుంది. అయితే పనుల నిమిత్తం అర్జున్ సింగ్ ఢిల్లీలో ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

అయితే ఈ ఘటనపై బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Next Story