నాడు ఎండలు.. నేడు భారీ వర్షాలతో.. పంట చేతికి వచ్చేనా ?

by  |
నాడు ఎండలు.. నేడు భారీ వర్షాలతో.. పంట చేతికి వచ్చేనా ?
X

దిశ, నిర్మల్ రూరల్: రైతుల‌పై ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులు భారీగా నష్టపోతున్నమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులు‌గా ఎండలకు పంట నష్టపోగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షానికి వచ్చిన వరదలతో తీవ్ర పంట నష్టం వాటిల్లింది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పోన్కల్ గ్రామానికి చెందిన ఓ రైతు 2 ఎకరాల వరి పంట సాగుచేశారు. గత నెల క్రితం కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో‌కి భారీ వరద రావటంతో ఇసుక మెటలు పెట్టాయి. ఇసుక మెటలను తొలగించి మళ్ళీ వరినాటు వేసిన రెండు రోజుల్లో మళ్ళీ భారీ వర్షం కురవడంతో భారీగా వరద వచ్చి మళ్ళీ పంట పొలం కొట్టుకుపోవడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Next Story