HYD : ఎన్నికల వేళ భారీగా పట్టుబడ్డ మద్యం..విలువ ఎంతో తెలుస్తే షాక్

by Disha Web Desk 4 |
HYD : ఎన్నికల వేళ భారీగా పట్టుబడ్డ మద్యం..విలువ ఎంతో తెలుస్తే షాక్
X

దిశ, క్రైమ్‌బ్యూరో : ఎన్నికల వేళ మద్యం బాటిల్స్ ఆచూకీ లేకుండా తరలిపోతున్నాయి. డిపోల నుంచి మద్యం బాటిల్స్‌ను తరలించే క్రమంలో పత్రాలలో చూపించాల్సిన చిరునామా ఏమి లేకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులకు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు కొంత మంది ఇలా ఆచూకీ లేని ప్రాంతానికి మద్యాన్ని తరలిస్తున్న వ్యవహారంపై పోలీసులు ప్రత్యేక నజర్ పెడుతున్నారు. అయితే ఈ లిక్కర్ కార్యకర్తలు, ఓటర్ల కోసమా అని ఇంకా ఎక్కడ ఆధారాలు దొరక లేదని పోలీస్ అధికారులు చెప్పుతున్నారు.

ఎన్నికల కోడ్ తనిఖీలల్లో భాగంగా ఇప్పటికే కొన్ని లక్షల లీటర్ల మద్యం, కోట్లు విలువ చేసే వీటిని పట్టుకుంటున్న పోలీసు లు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీస్ లు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.21.53 లక్షలు, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.15.46 లక్షలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పత్రాలాల్లో ఈ మద్యం చేరాల్సిన ఆచూకీ లేకపోవడం, నమోదు చేసిన వాహనానికి బదులుగా మరో వాహనం ఉండడంతో పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకుని తరలిస్తున్న వారి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed