ఎన్నికల వేళ బీజేపీ నేత దారుణ హత్య.. తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

by Disha Web Desk 19 |
ఎన్నికల వేళ బీజేపీ నేత దారుణ హత్య.. తుపాకీతో కాల్చి చంపిన దుండగులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ దారుణం జరిగింది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన మొహ్లా-మాన్‌పూర్ జిల్లా అంబాగర్ చౌకీ పట్టణంలో బీజేపీ నేత బిర్జు తారామ్ ను దుండగులు దారుణంగా హత్య చేశారు. గత రాత్రి బిర్జు తారామ్ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు అగంతకులు 3 రౌండ్ల కాల్పులు జరిపి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే ఈ దారుణానికి పాల్పడింది మావోయిస్టులే అని ఇప్పుడే చెప్పలేమని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రత్న సింగ్ చెప్పారు.

కాగా మోహ్లా-మన్‌పూర్‌తో పాటు మరో 19 ఇతర నియోజకవర్గాల్లో వచ్చే నెల 7న తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఛత్తీస్ ఘడ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో స్పందిస్తూ ఇది టార్గెట్ మర్డర్ అని అరోపించారు. బీజేపీ కార్యకర్తలను ఈ దాడితో అణిచివేయాలని చూస్తే అది జరగని పని అన్నారు.


Next Story

Most Viewed