BREAKING: హైదరాబాద్ బాచుపల్లిలో సంచలనం.. యువకుడిని దారుణంగా చంపి ఇన్‌స్టాలో రీల్స్ చేసిన దుండగులు

by Disha Web Desk 1 |
BREAKING: హైదరాబాద్ బాచుపల్లిలో సంచలనం.. యువకుడిని దారుణంగా చంపి ఇన్‌స్టాలో రీల్స్ చేసిన దుండగులు
X

దిశ, వెబ్‌డెస్క్: యువకుడిని దారుణంగా హతమార్చి ఇన్‌స్టా‌గ్రామ్‌లో దుండగులు రీల్స్ చేసిన అమానుష ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్ చెరవు కట్ట వద్ద తేజస్ అనే యువకుడిని గుర్తు తెలియని 9 సార్లు కత్తులతో పొడిచి, బండరాయితో తలపై మోది దారణంగా హతమార్చారు. కాగా, గతేడాది దసర రోజున జరిగిన ఓ హత్య కేసులో తేజస్ నిందితుడిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. హత్య అనంతరం దుండగులు ఇన్‌స్టా‌గ్రామ్‌లో రీల్ చేశాడు. తేజస్‌ను తామే చంపేశామంటూ సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని వీడియో అధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు పాత కక్షలే అయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

Next Story

Most Viewed