రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

by Disha Web Desk 2 |
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. అర్ధరాత్రి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో బొడ్డు అజయ్(22) అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతి చెందిన యువకుడిది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంగా గుర్తించారు. యువకుడి అకాల మరణంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మరణవార్త తెలిసిన తల్లిదండ్రులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యాక్సిడెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed