చేపల వేటకు వెళ్ళి గల్లంతైన వ్యక్తి…

by Taduka Kalyani |   (  Updated:2024-09-08 16:24:40  IST  )

చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి గల్లంతైన ఘటన నల్గొండ జిల్లా పెద్ద మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో చోటుచేసుకుంది.

చేపల వేటకు వెళ్ళి గల్లంతైన వ్యక్తి…
X

దిశ, పెద్ద అడిశర్లపల్లి: చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి గల్లంతైన ఘటన నల్గొండ జిల్లా పెద్ద మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో చోటుచేసుకుంది. గుడిపల్లి ఎస్సై నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ పట్టణానికి చెందిన మహమ్మద్ జబ్బర్ 47 ఆదివారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తలపుల వద్ద చేపలు పట్టేందుకు గాలం తో ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు రిజర్వాయర్ లో పడి గల్లంతయ్యాడు. దీంతో వెంట వచ్చిన స్నేహితుడు సమాచారం ఇవ్వడంతో వెంటనే గుడిపల్లి పోలీసులు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story