చికిత్స పొందుతూ మహిళ మృతి..

by Disha Web Desk 11 |
చికిత్స పొందుతూ మహిళ మృతి..
X

దిశ, గద్వాల: చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందిన సంఘటన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మల్లకల్ మండలం మద్దెలబండ గ్రామానికి చెందిన పాపమ్మ (55) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. 11 రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భసంచిలో సమస్య ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.

బుధవారం ఆమెకు గర్భసంచి ఆపరేషన్ చేశారు. గురువారం ఉదయం ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ ను వివరణ అడగగా.. అంతకుముందే ఆమెకు గర్భసంచిలో ప్రాబ్లం, అస్తమా వంటి సమస్యలు ఉండడంతో విషయాన్ని తెలియజేసి ఆపరేషన్ చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆపరేషన్ వికటించి మహిళ మృతి అనే సమాచారం వాస్తవం కాదని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed