బయోడీజిల్ ట్యాంక్లో పడి ఇద్దరు యువకులు మృతి

by Dishafeatures2 |
బయోడీజిల్ ట్యాంక్లో పడి ఇద్దరు యువకులు మృతి
X

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: కాజులూరు మండలం గొల్లపాలెం శివారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో గల బయో డీజిల్ ట్యాంకులో పడి ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆర్యవటం గ్రామానికి చెందిన తాతపూడి మహేష్ అనే 25 సంవత్సరాల లారీ డ్రైవర్ అతని వద్ద క్లీనర్ గా పనిచేస్తున్న శీల గ్రామానికి చెందిన 25 సంవత్సరాల నేరేడుమిల్లి శివకుమార్ లు గత ఎంతో కాలంగా మూతపడిన బయో డీజిల్ ఫిల్లింగ్ చేసిన వద్దకు రెండు మోటార్ సైకిల్ పై వచ్చిన వీరిద్దరూ డీజిల్ ట్యాంకులు దిగి ప్రాణాలు కోల్పోయినట్లు కాకినాడ సీఐ శ్రీనివాస్ తెలిపారు. మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో బంధువులు, దళిత సంఘాలు, బీఎస్పీ నాయకులతో సీఐ శ్రీనివాస్, ఎస్సే తులసీరామ్ చర్చలు జరుపుతున్నారు.

Next Story

Most Viewed