పాఠశాలలో ఉరేసుకున్న ఇద్దరు విద్యార్థులు

by Sujitha Rachapalli |

మహారాష్ట్ర పాల్ఘర్‌లోని అంబిస్టేలో విషాం చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఉరేసుకుని చనిపోయారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు.. పాఠశాల ప్రాంగణంలో చనిపోవడంతో కలకలం రేగింది. మృతులు దేవిదాస్ పరశురాం నవలే, మనోజ్ సీతారాం వాడ్‌ అని

పాఠశాలలో ఉరేసుకున్న ఇద్దరు విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర పాల్ఘర్‌లోని అంబిస్టేలో విషాం చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఉరేసుకుని చనిపోయారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు.. పాఠశాల ప్రాంగణంలో చనిపోవడంతో కలకలం రేగింది. మృతులు దేవిదాస్ పరశురాం నవలే, మనోజ్ సీతారాం వాడ్‌ అని తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. విద్యాధికారులు ఇప్పటికే స్కూల్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు.

పాల్ఘర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ వినాయక్ నార్లే, ఎంపీ హేమంత్ సావ్రా, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రకాష్ నికమ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రజాప్రతినిధులు ఈ కేసులో నిస్పాక్షిక దర్యాప్తు సాగాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు ఆత్మహత్యకు గల కారణాలేంటి? విద్యార్థులు ఇంత పెద్ద స్టెప్ తీసుకునేందుకు దారితీసిన పరిస్థితులేంటి? తెలియాల్సి ఉంది.

సి వ్వ్వ్వ్వ్వ్వ్జ్జ్హాబ్బ్

Next Story