వినాయక శోభయాత్రలో పెను విషాదం.. ఇద్దరు దుర్మరణం

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

వినాయక శోభయాత్రలో పెను విషాదం.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అల్లూరి జిల్లా(Alluri District)లో జరిగిన వినాయక శోభయాత్ర(Vinayaka Procession)లో పెను విషాదం చోటుచేసుకుంది. డ్యాన్స్ చేస్తున్న యువకుల మీదకు ఓ స్కార్పియో వాహనం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పాడేరు మం. చింతలవీధిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయాలపాలయ్యారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story