పోలీసులే టార్గెట్‌గా IED బ్లాస్ట్.. తప్పిన పెను ప్రమాదం!

by Disha Web Desk 19 |
పోలీసులే టార్గెట్‌గా IED బ్లాస్ట్.. తప్పిన పెను ప్రమాదం!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పోలీసులను టార్గెట్ చేసి మావోయిస్టులు అమర్చిన ఐఈడీ ప్రెషర్ బాంబు పేలి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఈ సంఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం ఉదయం పుస్నార్ క్యాంపు నుంచి పోలీస్ బలగాలు ఏరియా డామినేషన్‌లో భాగంగా హీరోలి వైపు బయలుదేరాయి. టెక్మెటా కొండ ప్రాంతం నుంచి వెళుతుండగా మావోయిస్టులు పెట్టిన బాంబు పేలి ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత వీరిని హెలీకాప్టర్ ద్వారా రాయ్ పూర్ ఆస్పత్రికి తరలించారు.

Also Read: కేసీఆర్ మరో నిజాం: సీఎంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర విమర్శలు

ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన

Next Story

Most Viewed