రైల్వేస్టేషన్‌లో దారుణం.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఇద్దరు

by Gantepaka Srikanth |

గుంటూరు సమీపంలోని బాపట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాపట్ల రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు.. ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నారు.

రైల్వేస్టేషన్‌లో దారుణం.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఇద్దరు
X

దిశ, వెబ్‌డెస్క్/బాపట్ల: గుంటూరు సమీపంలోని బాపట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాపట్ల రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు.. ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నారు. క్షతగాత్రులలో ఒకరు (లక్ష్మీనారాయణయ) రిటైర్డ్ ఉద్యోగి కావడం గమనార్హం. మరొకరు నల్లమోతు మాధవిగా పోలీసులు గుర్తించారు. వీళ్లిద్దరు పెట్రోల్ పోసుకోవడాన్ని రైల్వే స్టేషన్‌లో ఉన్న పలువురు గమనించి అడ్డుకున్నారు. అప్పటికే దాదాపు 30 శాతం వరకూ కాలిపోయారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి.. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story