రోల్డ్ గోల్డ్ చైన్, సెల్ ఫోన్ ను దొంగిలించిన ఇద్దరి అరెస్టు

by Disha Web Desk 1 |
రోల్డ్ గోల్డ్ చైన్, సెల్ ఫోన్ ను దొంగిలించిన ఇద్దరి అరెస్టు
X

దిశ, నిజామాబాద్ క్రైం : పట్టణంలోని 4వ టౌన్ పరిధిలో ఈ నెల 12న వినాయక్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక యువతి మెడలో నుంచి రోల్డ్ గోల్డ్ చైన్, సెల్ ఫోన్ దొంగిలించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు నగర సీఐ వెంకట నారాయణ తెలిపారు. ఆదివారం పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటనారాయణ మాట్లాడుతూ.. నగరంలోని ఆర్యనగర్ గూడెంకు చెందిన మేకల శ్రావణి అనే యువతి హౌజింగ్ బోర్డు కాలనీ నుంచి వెళ్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో నుంచి రోల్డ్ గోల్డ్ చైన్, సెల్ ఫోన్ లాక్కెళ్లారని తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు 4వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ అధారంగా దొంగతనానికి ఉపయోగించిన బైక్ ఆధారంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండం వెల్లుట్లకు చెందిన పశులది చంద్రశేఖర్ ప్రస్తుత నివాసం వినాయక్ నగర్, బొడిగళ్ల తేజ, వినాయక నగర్ కు చెందిన ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రోల్డ్ గోల్డ్ చైన్, దొంగతనానికి వాడిన బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన 4వ టౌన్ ఎస్.హెచ్.వో సందీప్, ఎస్సై తిరుపతి, కానిస్టేబుల్ రమేష్, నీలేష్, వేణులను సీఐ ప్రత్యేకంగా అభినందించారు.



Next Story

Most Viewed