- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండుగ పూట విషాదం..చెరువులో మునిగి పదో తరగతి విద్యార్థి మృతి
ఈతకు వెళ్లిన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బాలుడు చెరువులో మునిగి దుర్మరణం చెందాడు.

– చెరువులో మునిగి టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థి దుర్మరణం
– తొర్రూరులో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లడంతో దుర్ఘటన
– హయత్ నగర్ పీఎస్ పరిధిలో ఘటన
దిశ, వనస్థలిపురం : రంగారెడ్డి జిల్లా.. అబ్దుల్లాపూర్ మెట్ మండలం.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బాలుడు చెరువులో మునిగి దుర్మరణం చెందాడు. హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ వివరాల ప్రకారం.. తొర్రూరు గ్రామానికి చెందిన బచ్చిగళ్ల శంకరయ్య, అనితల కుమారుడు అభిలాష్ (16) ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. కాగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అనంతరం సుమారు 3.30 గంటల సమయంలో తొర్రూరులోని మంగళగుంట చెరువులో ఈతకు దిగగా, అభిలాష్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని గ్రామంలోని సువర్ణ అనే మహిళ అభిలాష్ తండ్రి శంకరయ్యకు ఫోన్ చేసి తెలిపారు. ‘తన కుమారుడు బాల శివ కుమార్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పినట్లు ఆమె శంకరయ్యకు వివరించారు. సమాచారం అందుకున్న శంకరయ్య వెంటనే చెరువు వద్దకు వెళ్లి వెతకగా.. అపస్మారక స్థితిలో ఉన్న అభిలాష్ను బయటకు తీశారు. వెంటనే అంబులెన్స్లో దగ్గరలోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడి డ్యూటీ వైద్యుడు పరీక్షించి అప్పటికే బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రేపు ఎగ్జామ్..
మృతి చెందిన అభిలాష్కు రేపు కూడా పదోతరగతి ఎగ్జామ్ ఉన్నట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.






